Tuesday, April 28, 2015

గ్రంథాలయ స్వరూపం విష్ణుమూర్తి విశ్వరూపం

               నా ఎరుకలో ఒక లైబ్రరీ ద్వారా చదవేందుకు అవకాశం కల్పించడం కాక మహా అయితే ఒకటో రెండో కార్యక్రమాలు జరుగుతాయి... కాని నేను ఈ మద్య చూసిన ఒక గ్రంథాలయం స్వరూపం విష్ణుమూర్తి విశ్వరూపం మాదిరిగా అనేక రూపాలలో సేవలను అందించడం చూసా.....అదే వీరేశలింగ కవి సమాజ గ్రంథాలాయం
                 భీమవరం పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుముదవల్లి గ్రామం పూర్వం నుండీ చాలా ముందు చూపు కలిగిన యువకులను కలిగి ఉండేదేమో అందుకే 1800 నుండి 1900 వరకూ బహుముఖాలుగా అక్కడి ప్రజలు అభివృద్దివైపు అడుగులు వేసారు.  మిగిలిన వారితో వేయించారు. అలాంటి వారిలో కొందరు- రాసి సిమెంట్ - బి.వి.రాజు, లార్స్‌విన్ గ్రూప్ -ఎస్.కృష్ణంరాజు, డెల్టా పేపర్మిల్స్ - భూపతిరాజు సూర్యనారాయణరాజు, డా.బి.హెచ్.సుబ్బరాజు వంటి వారు. ఇదంతా జరగటానికి కారణం వీరేశలింగ కవి సమాజ గ్రంథాలాయం. దీని ద్వారా జరిగిన జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే తెలుస్తుంది - అభివృద్ది చిత్రం

అక్షరాశ్యతా వ్యాప్తి - ఈ గ్రంథాలయం ద్వారా రాత్రి పాఠశాలల నిర్వహణ జరిగేది. ఎందరో ఈఊరి పెద్దలు ఈ పాఠశాల ద్వారా విద్యావంతులు అవడం జరిగింది.
స్త్రీ విద్య - ఆనాడు రాచ కుటుంబాలలో ఘోషాపద్దతి ఉందేది. 1912 ప్రాంతంలో తిరుపతి రాజు గారు, స్త్రీలకు సంభందించిన ఎన్నో గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని ఇండ్లకు పంపుతూ వారిని చదివేట్లుగా చేయింఛడానికి మిగతా పెద్దలతో కల్సి కృషిచేసేవారు.
హిందీ ప్రచారం - 1920 నుండి ఈ గ్రంథాలయం ద్వారా హిందీ తరగతుల నిర్వహణ చేపట్టారు. హిందీ సాహిత్యం గురించి, హిందీ అవశ్యకత గురించి హిందీ తెలిసిన వారి ద్వారా చెప్పించేవారు.
అసృశ్యతా నివారణ - సమాజంలో కొందరిని అంటరానివారుగా పరిగణించదం పాపమని తిరుపతిరాజు గారి బృందం అంతరానితనం తొలగించేందుకు కృషిచేస్తూ, క్రైస్తవ బాల భక్త సమాజ గ్రంథాలయ స్థాపనకు సేవలందించారు.
వైద్య సహాయం - ఊరిలో పేదవారికి వైద్య సహాయం అందాలనృ ఉద్దేశ్యంతో - 1911 నుండి ఊరిలో వైద్యం తెలిసిన ఘంటశాల నాగభూషణం గారి ఆద్వర్యంలో గ్రంథాలయవేదికగా వైద్య శిబిరాలు కొనసాగేవి, ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. (గ్రంథపాలకులుగా ప్రస్తుతం ఆర్.ఎం.పి పనిచేస్తున్నారు)
సహాకార పరపతి సంఘం - పల్లెలకు రైతులు వెన్నెముఖ అని నిరూపించదానికన్నట్టుగా గ్రంథాలయానికి అనుభందంగా సహకార సంఘం ఏర్పాటు చేసి రైతులకు స్వల్ప వడ్డేలకు రుణాలు ఇవ్వడం చేసారు.
జాతీయోజ్యమానికి సహాకారం - జాతీయ ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు ఈ గ్రంథాలాయం ద్వారా పలు కార్యక్రమాలు చేసేవారు. వీటిలో గ్రామ యువకులు పాల్గొనేవారు.
రాజపుత్ర సమాజ సేవా సమితి - క్షత్రియ కుటుంబాలలో వివాహ, ఇతర శుభకార్యక్రమాల సమయంలో ఆయా కుటుంభాల పెద్దల నుండి కొంత కట్నం సమాజాభివృద్దికి ఖర్చుచేయడం తిరుపతిరాజుగారి బృందం మొదలెట్టింది. దీనిని ఒక నిధిగా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే వడ్డేని పేద విద్యార్ధులకు, ఇతర ఉపకారాలకు ఖర్చు పెట్టడం చేస్తున్నారు
స్త్రీ పునర్వివాహాలు - క్షత్రియ కుటుంభాలలో చాలా కాలం పునర్వివాహాలు ఉండేవి కవు, తిరుపతిరాజుగారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వాదాన్ని బలపర్చై 1934లో స్త్రీ పునర్వివాహ సమాజం ఏర్పరిచారు
పోస్టల్ సేవలు - చాలా కాలం కుముదవల్లిలో పోస్టాఫీసు లేదు. తిరుపతిరాజుగారి బృందం గ్రంథాలయంలోనే అసలు ధరకే పోస్తేజీని అందించేవారు.
ఇలా అనేకరకాలుగా ఈ గ్రంథాలయం ఊరికి విజ్ఞానాన్ని పంచడం అనేది ఒక విధంగా ఆ ఊరి ప్రజల అదృష్టమే...



No comments: