Thursday, February 18, 2016

అంతర్వేది తీర్ధం-లాంచీ ప్రయాణం


అంతర్వేది తీర్ధం అంటే మాహా ఇష్టంగా ఉండేది. ఇప్పుడు చించినాడ బ్రిడ్జి కట్టారు కనుక ఎక్కువ రాకపోకలు దానిపై నడుస్తున్నాయి కాని కొన్ని ఏళ్ల ముందు అది లేకపోవడం వలన నరసాపురం నుండి లాంచీల మీద వెళ్ళవలసి వచ్చేది.
రాత్రి గోదావరి నదిపై లాంచీ ప్రయాణం గమ్మత్తుగా ఉండేది.

 

భోజనం చేసి బయలుదేరి నరసాపురంకు  10, 11 గంటలకు వెళ్లి టికెట్ కోసం వలందర్ రేవులో క్యూలో నించుంటే గంట పట్టేది లాంచీ ఎక్కడానికి.  మరీ జనం ఎక్కువ ఉంటె సెకండ్ షో ఖర్చయిపోయేది. అప్పటికి జనం తగ్గుతారు కాబట్టి
తాటాకులతో వేసిన టెంపరరీ వంతెనల మీదుగా ఓఎన్ జీసీ పెద్ద పంట్లమీడకు దూకి -
ఒక్కో లాంచీ రాగానే లెక్క ప్రకారం ౩౦ మందిని ఎక్కిన్చగానే  లాంచీ ప్రయాణం మొదలయ్యేది. 
ఇక అప్పటి నుండి రాత్రి చలిలో గోదారిలో ప్రయాణం - మద్య మద్య ఎర్ర దీపాలను గుర్తులుగా పెట్టేవారు. ఎర్ర దీపాల కు అటు ప్రక్క వచ్చే లాంచీలు ఇటు ప్రక్క వెళ్ళేవి అలా వచ్చేలాన్చీలను లెక్కపెట్టుకొంటూ 
అటు లాంచీ వచ్చినప్పుడల్లా కెరటాలు రావడం మా లాంచీ ఊగిపోవడం, అందులో ఉన్న వాళ్లకు మా వాళ్ళు మా వాళ్లకు వాళ్ళు చేతులూపుతూ జనాల కేకలు అరుపులు అలా 2 గంటలు ప్రయాణం చేసేవాళ్ళం 
అక్కడి నుండి సముద్రమ దగ్గరకు చీకట్లో సగం రోడ్డు మిగతా సగం ఇసుకలో నడిచి చీకట్లో సముద్రం కనిపించగానే దాన్లోకి దూకి  గెంతులు. 
మెల్లగా తెల్లవారు వరకూ అలా కొట్టుకొని  
ఎర్ర ఎర్రని  సూర్యుడు పై పైకి పసుపు రాసుకొంటూ రావడం చూచేసి ఆయన తెల్ల తెల్లగా అయ్యేవరకూ ఉండి 
బట్టలు మార్చుకొని దేవాలయ దర్శనానికి వచ్చేవాళ్ళం


దర్శనం అయ్యాక దేవాలయ భోజన ప్రసాదం లేదా వేరు వేరు సంఘాల వారు నిర్వహించే అన్న సమారాధన భోజనమో చేసి తిరునాళ్ళలో పడితే సాయంత్రం అయ్యిపోయేది, 
ఇక అక్కడి నుండి అశ్వరూడాంభిక ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, వశిష్టాశ్రమం, గోదావరి సముద్ర సంగమం దానికి దగ్గరలో ఉన్న లైట్ హౌస్ ఇలా అన్నీ ఒక రౌండ్ వేసి -  మళ్ళీ తిరిగి లాంచీల రేవులో ఎదురు చూపులు, నరసాపురం నుండి బస్సులు - అదీ అంతర్వేది చాలా మందికి తెలిసిన కథ :)