Tuesday, August 11, 2015

బోట్ లైబ్రరీ ( Boat Library )

గోదావరిలో బొట్ హాస్పిటల్ అనేది నడుస్తుండేది. గోదావరి పరివాహక ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన అది బాగా ప్రాచుర్యం పొందింది.
ఇది చాలామందికి తెలుసు,
అలా నడిచిన బోట్ లైబ్రరీ గురించి తెలుసా ?
                 విజయవాడలో ఈ బోట్ లైబ్రరీ నడిపారు. కృష్ణా బ్యాంక్ కాలువ మీదుగా పెదవడ్లపూడి నుండి కొల్లూరు వరకూ ఇది నడిచేది.
              పాతూరి నాగభూషణం గారి ఆధ్వర్యలో ఆర్యబాల సమాజంలో దీని ప్రార్ంభోత్సవానికి అంకురార్పణ చేయగా అటునుండి  సేవాశ్రమవాణీ మందిరం నుండి గ్రంథాల పెట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి పెద్ద బొట్ వంటి దానిలో అలంకరించారు. కాలువ వడ్డున సభ తీర్చి వక్తల ప్రశంగానంతరం గుంటూరు గ్రంథాలయ అద్యక్షులు శరణు రామస్వామి చౌదరి గారి చేతుల మీదుగా అక్టోబర్ 1935లో దీనిని ప్రారంబించారు.
అప్పటి నాయకులతో నిండి ఉన్న లాంచీ గ్రంథాలయము
 
              కాలువలో మెల్లగా పయనిస్తూ గ్రంథ పఠనం చేయడంలో మజా తెలియడం వలనో లేక గ్రంథాలయం వినూత్నంగా ఉండటం వలనో దీనికి విపరీతమైన ఆధరణ వచ్చింది.  బోట్ గ్రంథాలయానికి వస్తున్న ఆధరణ వలన  పెదవడ్లపూడి నుండి పిడపర్రు వరకూ మరొక గ్రంథాలయం ప్రారంభించాలని నిర్ణయించాలనుకొన్నారు. 
ఇలా రెండు బొట్ వంటి లాంచీల మీదుగా గ్రంథాలయాలను చాలా ఏళ్ళు నడిపిన ఘనత మన పెద్దలది.


No comments: