Showing posts with label 2015 puskaralu. Show all posts
Showing posts with label 2015 puskaralu. Show all posts

Monday, July 13, 2015

పుష్కర కష్టాలలో ప్రశాంత స్నానం

 
పుష్కరాలలో కష్టాలు అన్నిటినీ దాటి ప్రశాంతంగా స్నానమాచరించడం అసాద్యమే. అయితే అందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేమంటే రాజమండ్రి కొవ్వూరుల్లో స్నానం సరదా తీరాలంటే కిలోమీటర్ నడిచి అల్లకల్లోలంగా ఉన్న ఆ మురుగు నీటిలో ఒకమునకేస్తే నిజ్జంగానే దేవుని దర్శనం జరిగి మతి పోతుంది. ఇక ఇటు నరసాపురం, సిద్దాంతం, కోటిపల్లి లాంటి బి గ్రేడ్ ఘాట్లలో పట్టుమని పది అడుగుల నీరు లేదు. ఇక మిగిలింది అంతర్వేది. అక్కడ స్నానం సరదా తీరినా బయటకొచ్చాక వళ్ళంతా ఉప్పుతో కంపరమెత్తిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మిత్రులకు కొన్ని సులభ, ప్రశాంత స్నానానికి చిట్కాలు
ధవళేశ్వరానికి దిగివ వేమగిరి ఉంది. అక్కడ దిగి హైవేమీద కడియం వైపుగా కొన్ని మీటర్లు నడిచొస్తే చిన్న దేవాలయాల ప్రక్కగా కాలువమీద వంతెన ఉంది. దానిమీదుగా అవతలివైపు వెళితే గోదావరి గట్టు దానికి ఆనుకొని ఒక మాదిరి రేవు ఉన్నాయి. ఇక్కడ పుష్కలంగా నీళ్ళుంటాయి. దూరంగా ధవళేశ్వరం బేరేజి కనిపిస్తూ ఉంటుంది
  
ధవలేశ్వరం చేపల మార్కెట్ ఎదురుగా పార్కులోకి మార్గం ఉంది దాని ప్రక్క నుండి గోదావరి గట్టు సిమెంట్ రోడ్డుగా మార్చారు. అక్కడ రాం పాదాల రేవులంత కాకున్నా రెండు ఓ మాదిరి రేవులున్నాయి. అక్కడకు బైక్‌లమీద హాపీగా వెళ్ళవచ్చు, నెమ్మదిగా స్నానం చేయవచ్చు.
  
పెరవలి మీద నుండి ధవళేశ్వరం వైపు హైవే మీదుగానే ఖండవల్లి చిన్న పల్లె, క్రిందకు దిగితే ఓ మాదిరి రేవు. నీళ్ళున్నాయి. 

పెరవలి హైవే మీదవెడమవైపు దిగి నిడదవోలు వెళ్లే రోడ్డులో 2 కిలో మీటర్లు వెళితే కాకరపర్రు, ప్రక్కన తీపర్రు రెండు రేవులు, కాకరపర్రు కొద్దిగా లోపలకు వెళ్ళాలి, ఆటోలు ఉన్నాయి. తీపర్రు రోడ్డుమీద నుండి నడిచే దూరంలో రేవు ఉంది 
ఇవన్నీ కార్లు బైకులు అందుబాటులో ఉన్న అందరూ ఉపయోగించుకొని మీ పుష్కర స్నానాన్ని పవిత్రంగా, ప్రశాంతంగా చేసుకోవచ్చు.